మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయని మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నుంచి శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఫలితాలు చూసి అన్ని వదిలి హిమాలయాలకు పోదాం అనిపించింది అని వైసీపీ నేతలతో చెప్పడం, కానీ 40శాతం ఓట్లు వచ్చాయని ఆగిపోయానని వ్యాఖ్యానించడం ఇవన్నీ పరిణితి లేని ఆలోచనలకు సంకేతంగా ఉన్నాయన్నారు.