మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పిఏ గోండు మురళి ఇంటిపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మురళి ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులు ఉండటంతో గురువారం ఉదయం నుండి ఆయన ఇంటి వద్ద దాడులు కొనసాగుతున్నాయి. ఆయన పనిచేస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రం బుడితిలో ఉన్న కంప్యూటర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు విశాఖ, కోటబొమ్మాలి మండలాలలో కూడా చేపడుతున్నామని అధికారులు తెలిపారు.