మందస మండలం మూలిపాడు గ్రామంలో శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక భావాలు అలవర్చుకోవాలని సూచించారు. వేదమంత్రోచ్ఛారణలతో మూలిపాడు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.