శ్రీకాకుళంలో భారీ దొంగతనం

50చూసినవారు
శ్రీకాకుళం పట్టణంలోని మహాలక్ష్మినగర్ కాలనీ అజంతా గార్డెన్స్ లో శనివారం చోరీ కలకలం రేపింది. స్థానికంగా నివాసం ఉంటున్న అర్జల గురుమూర్తి కుటుంబ సమేతంగా వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరులో బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లారు. తాళం వేసి ఉన్న ఇంటిని గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి 15 తులాల బంగారంతో పాటు రూ. 20 వేల నగదు దోచుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్