ప్రతీ నెలా రెండో శనివారం సెలవును అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి అమలు జరిగేలా రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లా ఆర్. ఐ. ఓ, విద్యాశాఖాధికారులు దృష్టి నిలిపి చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్టు కమిషన్ సభ్యులు గొండు సీతారాం తెలిపారు. గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.