న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా అర్థం చేసుకోవాలంటే విద్యార్థులు కోర్టు ప్రక్రియలను దగ్గర నుంచి గమనించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండడం సామాజికంగా ప్రయోజనకరమని వివరించారు. శుక్రవారం న్యాయ సేవా సదన్లో శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.