శ్రీకాకుళం జిల్లాలో గత నాలుగు నెలల్లో పోయిన 505 సెల్ఫోన్లను మళ్లీ రికవర్ చేసి బాధితులకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మంగళవారం అందజేశారు. దీని విలువ సుమారు రూ.80 లక్షలు ఉంటుందని పోలీసు కార్యాలయంలో జరిగిన "ఫోన్ రికవరీ మేళా"లో ఆయన తెలిపారు. ఇంకా 400 ఫోన్లు దొరకలేదన్నారు. సెల్ ఫోన్ పొగొట్టుకున్న బాధితులు https://www.ceir.gov.inలో 24 గంటల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.