రాష్ట్ర ప్రభుత్వంతో యాక్సిస్ ఒప్పందం రద్దు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి. కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం ఈపీడీసీఎల్ శ్రీకాకుళం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ట్రూ ఆఫ్, సర్ చార్జీల రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.