శ్రీకాకుళం జిల్లా కి చెందిన తొమ్మిది మంది వలస కూలీలు మస్కట్ దేశంలో చిక్కుకున్నారు. ఉద్యోగం కోసం వలస వెళ్లి అక్కడ అవస్థలు పడుతున్నారు. వెళ్లి మూడు నెలలు అవుతున్న ఉద్యోగం చూపియలేదని, తినడానికి తిండి లేదని తెలుపుతూ గురువారం ఒక వీడియో రిలీజ్ చేసారు. ఏజెంట్ లు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు కోరారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు.