శ్రీకాకుళం: నల్లరిబ్బన్ లతో ఇంజనీరింగ్ కార్మికుల నిరసన

82చూసినవారు
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద శుక్రవారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు నల్ల రిబ్బన్ తో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి. తిరుపతిరావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్, నాన్-టెక్నీకల్ గా పెంచి ఇవ్వాలన్నారు. రిటైర్మెంట్ వయసు 60 నుండి 62కి పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్