ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లపై మాసాంతపు తనిఖీల్లో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లోని ఈవీఎం గోదామును రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి కె. విశ్వేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు ఈ తనిఖీ నిర్వహించారు. గోదాములో అమలులో ఉన్న ట్రిపుల్ లాక్ విధానం, 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా వ్యవస్థలను, సిబ్బంది విధులు, హాజరును ఆయన సమీక్షించారు.