గోకులాల ఏర్పాటుతో వ్యవసాయానికి సాయంగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలంలోని బైరి గ్రామంలో శనివారం గోకులాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం 268 గోకులాలు నిర్మిస్తే, మేం ఆరు నెలల్లో 12, 500 గోకులాలు నిర్మించామని తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలనేదే గోకులాల పథకం ఉద్దేశం అన్నారు.