శ్రీకాకుళం: మొబైల్‌ చోరీకి గురైతే సీఈఐఆర్‌ ద్వారా ఫిర్యాదు

66చూసినవారు
శ్రీకాకుళం: మొబైల్‌ చోరీకి గురైతే సీఈఐఆర్‌ ద్వారా ఫిర్యాదు
మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. సుమారు రూ. 80 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్లను మంగళవారం జిల్లా పోలీసు కార్యా లయంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా వివిధ కారణాలతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్టు తెలిపారు. ఇప్పటికే తొమ్మిది విడతలుగా రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందజేశామని, ఇప్పుడు పదో విడతగా 505 ఫోన్లను బాధితులకు అప్పగించామన్నారు.

సంబంధిత పోస్ట్