అహ్మదాబాద్లో గురువారం జరిగిన విమాన ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదంపై లోతుగా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. బాధ్యులను ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. కాసేపట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.