ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన కావలి గ్రీష్మ ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నియమించారు. అయితే ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కూతురే గ్రీష్మ. కావలి కుటుంబంలో గ్రీష్మ నాలుగో తరం రాజకీయ నాయకురాలుగా ఎదిగారు. ఈ మేరకు గ్రీష్మ ఎమ్మెల్సీ నియామకం పట్ల టీడీపీ శ్రేణులు, దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.