శ్రీకాకుళం: మే 20న దేశవ్యాప్తంగా వామపక్షాలు సమ్మెకు పిలుపు

78చూసినవారు
లేబర్ కొడ్డ్స్ రద్దు చేయాలని, నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే తదితర డిమాండ్లతో మే 20న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక, కర్షక సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం శ్రీకాకుళం నగరంలో వామపక్షాలు సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పంటల మద్దతు ధరల చట్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తేజేశ్వరరావు, ప్రకాష్, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్