ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే గేయంగా పనిచేస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్టీసీ డిపోలో శనివారం కొత్త బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పెద్ద సంఖ్యలో కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని వివరించారు.