ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. తన కార్యాలయంలో గురువారం గార, శ్రీకాకుళం రూరల్ మండల్, అర్బన్ల ప్రజల నుంచి సమస్యలపై వినతుల స్వీకరించారు. ప్రజా దర్బార్ లో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళ కోసం, గ్రామాల్లో రోడ్లు, కాలువలు నిర్మాణానికి అధికంగా అర్జీలు వస్తున్నాయని తెలిపారు.