విద్యాశాఖ చేపడుతున్న పాఠశాలల పునః వ్యవస్థీకరణతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని యూటీఎఫ్ ఉపాధ్యాయ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి జిల్లా కలెక్టర్ ను కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయ సంఘం యుటిఎఫ్ నాయకులు ఉన్నారు.