రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఆలస్యం చూపవద్దని జాప్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.