కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి ప్రస్తుతం వై కేటగిరీ భద్రత ఉండగా. దాన్ని ఇప్పుడు మరింత పెంచారు. వై- ప్లస్ కేటగిరీకి మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దాంతో రాష్ట్ర పోలీసుల తరపున ఇద్దరు గన్ మెన్ లతో పాటు మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ అధికారులు కలిపి మొత్తం ఆయన వెంట నలుగురు సిబ్బంది భద్రతగా ఉండనున్నారు. ఈ మేరకు కేంద్రం నియమించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సీఆర్పీఎఫ్ కమాండో గురువారం విధుల్లో చేరారు.