నాగావళి నది పరివాహక నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘా పెట్టినట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టే దిశగా డచ్ బంగ్లా, కంపోస్టు కాలని, దమ్మవీధి, గుడివీధి, నాగావళి నది పరివాహక ప్రాంతాలు, పట్టణ చివర ప్రాంతాలలో నిఘా వేశామన్నారు. బహిరంగంగా మద్యం, గంజాయి సేవించడం, పేకాట, ఈవిటిజింగ్, చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.