శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ సోమవారం శ్రీకాకుళం మునిసిపల్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఇతర అధికారులు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఆర్థికాభివృద్ధికి ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ ప్రధాన మూలస్తంభమని అన్నారు. పది సూత్రాల డాక్యుమెంట్ను సీఎం ఆవిష్కరిస్తూ 2047 నాటికి భాగ్యనగరంగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి వ్యక్తికి ఆరోగ్యం, సంక్షేమం, సంతోషం కల్పించాలని లక్ష్యంగా ప్రకటించారు.