ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం కారణంగా సముద్రం వదిలిన మత్స్యకారుల జీవితం ఆదివారం నుంచి మళ్లీ సందడిగా మారనుంది. ఈ విరామం చేపల గుడ్ల పెట్టే కాలం కావడంతో ప్రతి ఏడూ అమలు చేస్తారు. ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు లక్షలాది మంది మత్స్యకారులు దీనిపైనే ఆధారపడతారు. అందుకే వీరికి కూటమి ప్రభుత్వం రూ.20 వేలు భృతి అందించి ఉపశమనంగా నిలిచింది.