స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో శ్రీకాకుళం జిల్లా కీలక పాత్ర పోషించనుందని ప్రతి నియోజకవర్గానికీ స్పష్టమైన అభివృద్ధి దిశ, కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సముద్ర తీరం, రవాణా వనరులు, వ్యవసాయ శక్తిని పూర్ణంగా వినియోగించుకుంటూ జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపడతామని సోమవారం వర్చవల్ గా మాట్లాడారు.