ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో మాత్రం మార్పు కనిపించడం లేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై ఓ ఛానెల్లో జర్నలిస్ట్ చేసిన అసభ్య వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అమరావతిని నాశనం చేయాలనే వైసీపీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. కాగా 'P4-జీరో పావర్టీ'లో భాగంగా 10 కుటుంబాలను ఆయన దత్తత తీసుకున్నారు.