అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం పరిశీలించారు. విజయవాడ నుంచి అక్కడికి చేరుకున్న ఆయనకు అధికారులు ప్రమాద వివరాలు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటన స్థలాన్ని సందర్శించారు. కాగా ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ఉన్నట్లు సమాచారం.