శ్రీకాకుళం ఎంపీ, కేంద్రపౌర విమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు శ్రీనగర్ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అభివృద్ధి పనులను గురువారం సమీక్షించారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో అప్రమత్తంగా సేవలందించిన సిబ్బందిని అభినందించారు. ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నిలిపివేసిన విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నామన్నారు. లాల్ చౌక్ వద్దనున్న స్థానిక దుకాణదారులతో మాట్లాడారు.