శ్రీకాకుళం నగరంలోని సీపన్నాయుడుపేట, ఫాజుల్బాగుపేటలను అన్ని విధాలుగా బాగు చేసి అభివృద్ధి చేసే బాధ్యత నాది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హామీనిచ్చారు. నగరంలోని సీపన్నాయుడుపేటలో బుధవారం పల్లె నిద్రలో భాగంగా ఎమ్మెల్యే గొండు శంకర్ పాజుల్బాగ్పేట, సీపా నాయుడుపేట ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించి ప్రజలతో మమేకం అయ్యారు. ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు.