శ్రీకాకుళం ఎంపీ కేంద్రమంత్రి కే. రామ్మోహన్ నాయుడు తన కార్యాలయంలో ఆదివారం ప్రజా దర్బార్ కార్యక్రమంలో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై మంత్రి రామ్మోహన్ నాయుడుకి వినతులు అందించారు. వినతులు స్వీకరించిన మంత్రి ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.