శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలో ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయం కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. పింఛన్లు పంపిణీపై కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం పలు ప్రాంతాల్లో కలెక్టర్ పింఛన్లు పంపిణీ చేశారు.