కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తండ్రి, ఉత్తరాంధ్ర దిగ్గజ నేత కింజరాపు ఎర్రన్నాయుడుతో తనకెంతో అనుబంధం ఉందని సింగర్ మనో గుర్తు చేసుకున్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరం విచ్చేసిన ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆత్మీయాలింగనం చేసుకున్నారు. ముఖ్యంగా చెన్నయ్ వచ్చిన ప్రతి సందర్భంలో ఎర్రన్నాయుడు తన ఇంటి ఆతిథ్యం స్వీకరించేవారని అన్నారు.