రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం హెచ్చరించింది. నేడు 42-43.5 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని మరో 21 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు ప్రభావం చూపుతాయని పేర్కొంది.