మందస ఎంపీడీఓగా వై. వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో వజ్రపుకొత్తూరు ఎంపీడీఓ ఎన్. రమేష్ నాయుడు మందస ఇన్చార్జ్ ఎంపీడీఓగా విధులు నిర్వహించేవారు. కాగా శ్రీకాకుళం మండల ప్రజా పరిషత్ పరిపాలనాధికారిగా విధులు నిర్వహిస్తున్న వై. వెంకటరమణను మందస రెగ్యులర్ ఎంపీడీఓగా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా నూతన ఎంపీడీఓను పలువురు మండల పరిషత్ సిబ్బంది అభినందించారు.