సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి టెక్కలి మండల కేంద్రానికి చెందిన టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు కోళ్ల కామేశ్వరరావు శుక్రవారం 2 కేజీల వెండి నాణేలను స్వామివారికి అందించారు. ఆధ్యాత్మిక భావంతో స్వామివారికి వెండి నాణేలు అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు చేయించారు.