సంతబొమ్మాలి శాఖా గ్రంధాలయంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గ్రంథాలయ అధికారి కే. రామకృష్ణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగ నిర్మాణం, బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ చేసిన సేవలు గురించి వివరించారు.