కోటబొమ్మాళి మండల కేంద్రంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని రేషన్ డీలర్లు సరైన తూకంతో నాణ్యమైన బియ్యం అందిస్తున్నారా లేదా అంటూ సివిల్ సప్లై డీటీ కె. రాము మండల వీఆర్వోలతో కలిసి బుధవారం పరిశీలించారు. రేషన్ లబ్ధిదారులకు, అంగన్వాడీ కేంద్రాలయాలకు, ప్రభుత్వ పాఠశాలల వంట నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి వీఆర్వో పి. అఖిల్, పలువురు ఉపాద్యాయులు పాల్గొన్నారు.