రాష్ట్రంలో జులై 1వ తేదీన పండగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం అన్నారు. రాష్ట్రంలో వివిధ పింఛన్ దారులకు గత ప్రభుత్వం విడతల వారీగా పెంచిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు 4వేలు పించన్ అమలు చేస్తుందన్నారు. ఏప్రిల్ నుండి పెంచిన పింఛన్ 3వేలు అదనంగా ఇస్తుందని అన్నారు.