సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ద్విచక్ర వాహనము నడిపేటప్పుడు ప్రతీ వాహన దారుడు మరియు వారి వెనుకున కూర్చున్నవారు హెల్మెట్ ను విధిగా ధరించాలని టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి ఎస్ హెచ్ ఆర్ తేజ చక్రవర్తి మల్ల అన్నారు. టెక్కలి కోర్టులో బుధవారం కక్షిదారులతో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ లేని కారణంగా తలకు బలమైన గాయాలు తగిలి మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు.