ఇకపై తనను కలవడానికి వచ్చేవారు శాలువాలు, పూలదండలు, పుష్పగుచ్ఛాలు తేవడం మానుకోవాలని మీ ప్రేమాభిమానాలు ఉంటే అదే తనకు పదివేల పూలదండలతో సమానమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇకపై తనును కలవడానికి శ్రీకాకుళం పట్టణంలోని 80 అడుగుల రోడ్డులో తన కార్యాలయానికి వచ్చేవారు పూలదండలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలు తేవద్దని కోరారు.