మండల కేంద్రం కోటబొమ్మాలి కోర్టులో మండల న్యాయ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది. జూనియర్ సివిల్ జడ్జి ప్రసన్న లత లోక్ అదాలత్ నిర్వహించి ఎక్కువ సంఖ్యలో కేసులను రాజీ చేశారు. ఈ లోక్ అదాలత్ బెంచ్ కు మెంబర్లుగా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లఖినేని శ్రీనివాసులు, సీనియర్ న్యాయవాది వెలమల అప్పలనాయుడు వ్యవహరించారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో సుమారు 130 కేసులను రాజీ చేశారు.