కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే ప్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో శనివారం రైలు నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో పాతపట్నం మండలం సీది పంచాయతీ తీమర గ్రామానికి చెందిన ఎందవ రామారావు తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. రైల్వే సిబ్బంది సమాచారంతో 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు.