నందిగాం మండలం కనితిఊరుకు చెందిన గిన్ని మల్లేశ్వరరావు పొలంలోని రెండెకరాల వరి కుప్పను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం నిప్పంటించి దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్ భాదితుడు మల్లేశ్వరరావుకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఘటనను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని తిలక్ హామీ ఇచ్చారు.