మండల కేంద్రం టెక్కలి లోని టౌన్-3 ఫీడర్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ జి. శంకరరావు తెలిపారు. అంజనాపురం, సవరగోపాలపురం, వీఆర్కేపురం, బొరిగిపేట, తదితర ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సరఫరాను నిలిపి వేస్తామన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని కోరారు.