టెక్కలి మండలం లచ్చన్నపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై బుధవారం భువనేశ్వర్ వెళ్తున్న కారు ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనా జరిగిన వెంటనే ట్రాక్టర్ ను తీసుకొని డ్రైవర్ పరార్ అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాక్టర్ వివరాలపై ఆరా తీస్తున్నారు.