సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామంలోని రైల్వేగేటు శుక్రవారం తెల్లవారుజామున విరిగిపోయింది. దీంతో సుమారు మూడు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే గేటు విరిగిపోవడంతో పాటు మరమ్మతులు ఆలస్యం కావడంతో పలువురు వాహనదారులు టెక్కలి మీదుగా వాహనాలను మళ్లించారు. ఈ మేరకు రైల్వేశాఖ సిబ్బంది గేటుకు మరమ్మతులు చేశారు.