కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తాము అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీ వెంటిలేటర్పై ఉందని, కేంద్రం సహకరించడంతో రాష్ట్రానికి ఆక్సిజన్ అందించామన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర సంపద సరిపోవడం లేదన్నారు. మత్స్యకారులను అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని జగన్ పై ఆయన మండిపడ్డారు.