మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టెక్కలిలో బుధవారం చోటుచేసుకుంది. నందిగాం మండలం హకుంపేటకు చెందిన ముడిదాన కేశవరావు(38) ఒంటరిగా ఎన్టీఆర్ నగర్-1లో నివాసముంటున్నారు. కొన్నేళ్ల కిందట అయన భార్య మృతి చెందగా కుమార్తె, కుమారుడు కుటుంబ సభ్యుల వద్ద ఉన్నారు. మృతుడు అప్పుల బాధ, ఒంటరితనంతో బాధపడుతున్నాడని ఈ కారణాలతోనే మన స్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకునట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదైంది.