టెక్కలి మండలం జగతిమెట్ట సమీప హైవే పై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీ కొని నందిగాం మండలానికి చెందిన బొడ్డ దశరథ (46) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీపురంలో మార్కెట్ కు వెళ్లి తెరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.