ద్విచక్ర వాహనం బోల్తా, యువకుడికి తీవ్ర గాయాలు

78చూసినవారు
ద్విచక్ర వాహనం బోల్తా, యువకుడికి తీవ్ర గాయాలు
టెక్కలి మండలం నర్సిపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోహిత్ (25) అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందిన వెంటనే నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం టెక్కలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్